ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం

శ్రీ పీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద హిందూపురం లోక్‌స‌భ, అసెంబ్లీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ తనను ఖరారు చేసినా.. చంద్రబాబు తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. కూటమిలో భాగంగా తమకు ఎక్కడ మైనారిటీ ఓట్లు పడవనే అనుమానంతోనే ఆ నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార ప్రక్రియ మొదలుపెట్టామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు.