యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరలో జాన్వీ జాక్ పాట్ అందుకుంది. ఇంతలోనే ఆర్.ఆర్.ఆర్ సహనటి ఆలియా భట్ ఇప్పుడు ఎన్టీఆర్ సరసన నటించనుందని కథనాలొస్తున్నాయి. ఎన్టీఆర్ ,హృతిక్ తో కలిసి వార్ 2లో నటిస్తున్నారని అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి దీనిపై ఊహాగానాలున్నాయి. వార్ 2లో ఆలియా ఒక హీరోయిన్ గా నటిస్తుంది. కానీ హృతిక్ సరసనా? లేక ఎన్టీఆర్ తో నటిస్తుందా? అన్నదానిపై స్పష్ఠత లేదు. అయితే ఆలియా లాంటి ట్యాలెంటెడ్ నటి ఎన్టీఆర్ కి సూటబుల్ అని అభిమానుల్లో ఒక సెక్షన్ వాదిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ సరసన నటించిన ఆలియా, ఆ సినిమా సెట్స్ లో ఉండగానే ఎన్టీఆర్ తోను ఎంతో సన్నిహితంగా కలిసిపోయి కనిపించింది. చరణ్, తారక్ ల ప్రతిభకు ఆశ్చర్యపోయానని ఆలియా కాంప్లిమెంట్ ఇచ్చింది. అప్పట్లోనే ఎన్టీఆర్ నటించే దేవర కోసం ఆలియాను ఒప్పించే పనిలో ఉన్నారని ప్రచారమైంది. కానీ జాన్వీ కపూర్ కు నటించే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు వార్ 2 కోసం ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఆలియా అంగీకరించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దేనికీ అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు. వార్ 2 ఈ నెలాఖరు నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న నేపథ్యంలో అయాన్ ముఖర్జీ కథానాయికలను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలిసింది. గంగూభాయి కతియావాడీ, గల్లీ బోయ్ సహా ఎన్నో చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్ని యువతకు పెర్ఫామర్ గా మారిపోయింది. ఇటీవలే కృతిసనోన్ తో కలిసి జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా ఆలియా షేర్ చేసుకుంది. అయాతే హృతిక్, ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లు. అందువల్ల ఈ కలయికలో రూపొందే చిత్రానికి ఆలియా అదనపు బలంగా మారుతుంది. ‘వార్ 2’ ఇప్పటివరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నిటీనీ బ్రేక్ చేసేందుకు ఆస్కారం ఉందని అంచనా. ఈ చిత్రానికి బ్రహ్మాస్త్రఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు.