Tag Archives: chandrababu

ఏపీలో బచ్చా రాజకీయం.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

తమ సభలకు వస్తున్న స్పందన చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని.. వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. తనను బచ్చా అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబును చూస్తుంటే కృష్ణుడిని బచ్చా అన్న కంసుడు గుర్తుకు వస్తున్నాడని సెటైర్లు వేశారు.. తనను బచ్చా అన్న వ్యక్తి పది మందిని వెంటవేసుకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు. బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని నన్ను చుట్టుముట్టారని వ్యాఖ్యానించారు. కానీ తాను ...

Read More »

ఓటమి భయంతో చంద్రబాబుకు ఫ్రస్టేషన్: వాసిరెడ్డి పద్మ

టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాక్షాత్తూ సీఎంపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. మంగళగిరి వైఎస్సార్‌సీపీ నేత వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారని, వైఎస్సార్‌సీపీ నాయకులు,సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయి. కేసులుంటే పదవులని లోకేష్ చెబుతున్నాడు. ఓటమి అంచున ఉన్నారు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబుకు అభివద్ధి.. పాలన చేయడం తెలుసా? ...

Read More »

జగన్‌ పై రాయి దాడి…ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

జగన్‌ పై రాయి దాడి జరుగడంపై…ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి అమానుషమని మండిపడ్డారు. జగన్ కు రాయి తగలడం టీవీలో లైవ్ చూసానని తెలిపారు. ముందు రాయి అనుకోలేదని…రాయి గట్టిగానే తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్లు వేశారు కానీ వాళ్లకు తాగలేదంటూ ఎద్దేవా చేశారు.

Read More »

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న ఆర్కే

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు పేరును చార్జ్ షీట్ లో తెలంగాణ ఏసీబీ 22 సార్లు ప్రస్తావించిందని… అయినప్పటికీ చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చలేదని పిటిషన్ లో ఆళ్ల పేర్కొన్నారు. అయితే, ఈ కేసు విచారణను సెలవుల తర్వాత చేపట్టాలని తెలంగాణ ...

Read More »

చంద్రబాబుకు నాపై కోపం : సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెపథ్యంలో సీఎం జగన్ మాట్లడుతూ చంద్రబాబు తనకు శాపనార్థాలు పెడుతున్నారని..చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తోంది. హై బీపీ వస్తోంది. ఏవేవో తిడుతూ శాపనార్థాలు పెడుతుంటాడు. నాకేదో అయిపోవాలని కోరుకుంటాడు. రాళ్లు వేయండి, అంతం చేయండి అని పిలుపునిస్తూ ఉంటాడు. బాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, కుట్రలు, మోసాలు గుర్తుకువస్తాయి అని విమర్శించారు.

Read More »

బందిపోటు రాజకీయమే చంద్ర‌బాబు పాలన మార్క్!

అయ్యా చంద్రబాబూ.. నీ 14 ఏళ్ల అమోఘమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీతోపాటు నీ ముఠాలో ఉన్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఇలా అందరూ ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నారో.. రాష్ట్ర భవిష్యత్తును ఎంత నాశనం చేశారో ప్రజలంతా చూశారు. పెత్తందార్ల ముఠాకు చంద్రబాబు నాయకుడనేది ప్రజలందరికీ తెలిసిపోయింది అని సీదిరి అప్పలరాజు అభివ‌ర్ణించారు.చంద్రబాబు తొత్తుగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏదేదో మాట్లాడాడు. ...

Read More »

చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్..?

గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభలో కొడాలి నాని మాట్లాడుతూ… సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైందన్నారు. అంతేకాకుండా,వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు కొడాలి నాని. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతోమందిని సీఎం జగన్ ఆదుకున్నారన్నారు. చంద్రబాబుది మాయా కూటమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక కుట్రలు చేశాడని మండిపడ్డారు. దేవుడు, ప్రజల ఆశీస్సులే సీఎం జగన్‌ను కాపాడాయన్నారు.

Read More »

జగన్‌ను హతమార్చాలని చంద్రబాబు కుట్ర-మంత్రి అంబటి

విజయవాడలో కుట్ర ప్రకారంగానే సీఎం జగన్‌పై దాడి జరిగిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సోమవారం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించారని అన్నారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడులకు దిగుతున్నారని విమర్శించారు. జగన్‌ను హతమార్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు అని అన్నారు. ముగ్గురూ కలిసి ఓడించడం కష్టమని భావించి హతమార్చాలనే కుట్ర చేశారని ...

Read More »

చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల -కొండా రాఘవరెడ్డి

చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల.. అంటూ వైఎస్సార్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపిందని.. ఆయన లాంటి విషసర్పాలకు పాలుపోస్తావా? అంటూ నిలదీశారు. వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోబోమని.. తెలంగాణలో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించిందని షర్మిలపై నిప్పులు చెరిగారు వైఎస్సార్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి. ఇప్పుడు ఇక్కడికొచ్చి రాజకీయం చేస్తోందన్నారు. షర్మిల ఎన్నికుట్రలు చేసినా… ఎవరూ పట్టించుకోరని.. వైసీపీ విజయం సాధిస్తుందన్నారు వైఎస్సార్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి.

Read More »

మీ ఆగ్రహం.. ధర్మాగ్రహం కావాలి: చంద్రబాబు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా రెండు రాష్ట్రాల ప్రజలకు వెరైటీ విషెస్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. అయితే నేడు మీ ఆగ్రహం…ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై….ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని ...

Read More »