బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆమె స్వరాష్ట్రం హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ సీటును కంగనాకు కేటాయిస్తూ బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటన వెలువరించింది. దీంతో అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న కంగనా.. ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.నా ప్రియమైన భారతదేశం, ఈ దేశ ప్రజల సొంత పార్టీ అయిన బీజేపీకి ఎల్లప్పుడూ నా బేషరతు మద్దతు వుంటుంది. నా సొంత రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్లోని మండి నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం నా పేరుని ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్ ...
Read More »Cinema
ఇండియన్ సీక్వెల్స్ పై క్లారిటీ..
లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇస్తునాడు. గతంలో శంకర్ దర్శకత్వంలో చేసిన భారతీయుడు సినిమా భారీ హిట్ అవ్వగా దానికి సీక్వెల్ ఇండియన్ 2 తీస్తున్నామని ప్రకటించారు. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఇండియన్ 3 సినిమా కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా కమల్ హాసన్ ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ తో పాటు తన సినిమాల గురించి కూడా మాట్లాడారు. కమల్ హాసన్ ...
Read More »హాలీవుడ్ చిత్రాలకి స్పూర్తిగా మన ఇతిహాసాలు..
ఇండియన్ సినిమాల్లోనే కాదు.. మన ఇతిహాసాల ప్రభావం హాలీవుడ్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. గతేడాది ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్కు మన భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన భోధనలే స్పూర్థి. మొదటి అణుబాంబు ప్రయోగంపై వచ్చిన ఈ చిత్రంలో శ్రీ కృష్ణుడు చెప్పిన.. సృష్ఠించింది నేనే నాశనం చేసింది నేనే అనే శ్లోకమే అణుబాంబు తయారీకి కారణమైనట్లు తెలిపారు ఓపెన్ హైమర్.ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా మంకీ మ్యాన్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు స్లమ్డాగ్ మిలీనియర్ ఫేమ్ దేవ్ పటేల్. ...
Read More »స్టార్ పేర్లు మార్చుకుంటున్న హీరోలు…
మన హీరోలందరికీ పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఒకప్పుడు స్టార్ హీరోలకు మాత్రమే వేసుకునే ట్యాగ్ ఇప్పుడు చిన్నా పెద్దా ప్రతి హీరోకి తమ పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు. ఇక కొంతమంది హీరోలు తమ పేరు ముందు ఉండే ట్యాగ్స్ ని కూడా మార్చుకుంటారు. ఇటీవల వరుసగా ముగ్గురు స్టార్ హీరోలు తమ పేర్లకు ముందు ఉన్న ట్యాగ్స్ మార్చుకున్నారు. పుష్ప సినిమా రిలీజ్ కి ముందు అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ ఉండే దాన్ని ...
Read More »విలన్ గా కనిపించబోతున్న శివాజీ ..
సినిమా పరిశ్రమలో ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన నటులను ఇప్పుడు విలన్స్ గా చూడడం చాలా సాధారణం అయ్యిపోయింది. పాత్రలో బలముంటే అది హీరో రోల్ అయినా, విలన్ రోల్ అయినా చేసేస్తున్నారు. ఈక్రమంలోనే హీరో శివాజీ కూడా విలన్ గా కనిపించబోతున్నారట. సపోర్టింగ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా పలు సినిమాల్లో నటించిన శివాజీ.. ఇటీవల బిగ్బాస్ షోతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు.ఆ షో పూర్తి అవ్వగానే #90s వెబ్ సిరీస్ తో సూపర్ హిట్టుని అందుకున్నారు. దీంతో ...
Read More »చెర్రీ బర్త్ డే సందర్భంగా సినిమా అప్డేట్..
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఈ నెల 27న చరణ్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మరోవైపు చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్లాంక్ లో ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఈ డ్రైవ్ ప్రారంభమవుతుంది.చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం ...
Read More »డైరెక్షన్ చేయాలనే ఆలోచన సాయిపల్లవి ..
సాయిపల్లవి నిజంగా టిపికల్ సౌతిండియన్. తను అందరిలాంటి ఆడపిల్ల కాదు. ఆమెలోని ఆత్మవిశ్వాసం.. ఆత్మగౌరవం.. నిజాయితీ.. ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. సాటి తారలతో నిలబడితే ధృవతారగా మెరిసిపోతుంటుంది. గార్గి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చి, దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగొచ్చిన ఈ బంగారుబొమ్మ.. ఇప్పుడిప్పుడే నిదానంగా మళ్లీ సినిమాలకు సైన్ చేస్తున్నది.తెలుగులో నాగచైతన్య తండేల్, తమిళంలో శివకార్తికేయన్ సినిమా ఇప్పటికే ఓకే చేసింది. అమీర్ఖాన్ కొడుకు హీరోగా రూపొందుతోన్న సినిమా ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేయనున్నది. ఇక నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న రామాయణంలో ...
Read More »జపాన్లో ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనత..
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా బ్లాక్ బస్టరే అని సినీ ప్రియులు అంతా ఆశిస్తుంటారు. అయితే ఈయన దర్శకత్వంలో చివరిగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్చరణ్లతో తెరకెక్కించిన ఈ సినిమా 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.అయితే ఈ సినిమాను ఇటివలే జపాన్లో ప్రత్యేక స్క్రీనింగ్ వేశారు. ఇక స్క్రీనింగ్ కోసం రాజమౌళి కుటుంబం జపాన్ వెళ్లి అక్కడి ప్రజలతో కలిసి ...
Read More »సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్…
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్. ఈ ఏడాదితో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. అలాగే టాలీవుడ్ లోని పలువురు దర్శకనిర్మాతలతో పాటు నటీనటులు కూడా హాజరయ్యారు. నిన్న మార్చి 22న హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.ఇక ఈ ఈవెంట్ లో పద్మవిభూషణ్ గ్రహీత చిరంజీవిని చిత్ర ప్రముఖులు సత్కరించారు. అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్, మురళీమోహన్, ...
Read More »ఉప్పెన మూవీ రీమేక్.. హీరోయిన్ ఎవరంటే..
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్- కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన సినిమా ఉప్పెన. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అందుకోవడంతో పాటు.. దాదాపు రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికాడ్డులు సృష్టించింది. ఈ సినిమాతో కృతి శెట్టి కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీని తమిళం, బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ...
Read More »