మరో రెండు వారాల్లో ‘మా’ ఎన్నికలున్న వేళ… తాజాగా సోమవారం ఉదయం సినీనటుడు ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికల నామినేషన్ వేశారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ కూడా నామినేషన్ వేశారు. నేటి నుంచి నుంచి ఈ నెల 29 వరకూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇస్తారు. అక్టోబర్ రెండో తేది సాయంత్రం ...
Read More »Entertainment
భారీ బడ్జెట్తో ఇంటి సెట్ నిర్మాణం
మహేష్ బాబు ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం దర్శకనిర్మాతలు ఒక పెద్ద ఇంటి సెట్ని సిద్ధం చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ దాదాపు రూ.5 కోట్ల బడ్జెట్తో ఈ ఇంటి సెట్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ...
Read More »యూకేలో రెండేళ్ల తరువాత ‘లవ్ స్టోరీ’
టాలీవుడ్ కు మంచి వసూళ్లు సాధించి పెట్టే ప్రాంతాల్లో ఓవర్సీస్ కూడా ఒకటి. అందులో ముఖ్యంగా యుఎస్ఎ బాక్సాఫీస్ తెలుగు సినిమాకి ప్రధాన ఆదాయాన్ని అందించే మార్కెట్లలో ఉంటుంది. యూఎస్ తో పాటు యూకేలో కూడా ‘లవ్ స్టోరీ’ భారీ సంఖ్యలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 900+ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యూకేలో దాదాపు రెండేళ్ల తరువాత విడుదలవుతున్న మొదటి చిత్రం ‘లవ్ స్టోరీ’ కావడం విశేషం. ఈ మేరకు మేకర్స్ థియేటర్స్ లిస్ట్ ను విడుదల చేశారు. ...
Read More »MAA ఎన్నికల్లో విష్ణు ప్యానల్ ఇదే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా లాంటి అగ్ర నటులు ఉండడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రకాశ్రాజ్ తన ప్యానల్ని ప్రకటించారు. మంచు విష్ణు కూడా తన ప్యానల్ సభ్యులను ఖరారు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో నేడు మంచు విష్ణు ‘మా కోసం మనమందరం’ పేరుతో తన ప్యానల్ సభ్యులను వెల్లడించారు. మంచు విష్ణు ప్యానల్ ఇదేఅధ్యక్షుడు : మంచు విష్ణుఉపాధ్యక్షులు : మాదల రవి, ...
Read More »పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన కంగనా
రచయిత జావేద్ అఖ్తర్ వేసిన పరువునష్టం కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోమవారం ముంబయిలోని అంథేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సారి గైర్హాజరైతే అరెస్టు వారెంట్ జారీ చేస్తామని కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ఆమె కోర్టుకు వచ్చారు. ఈ కేసులో కోర్టు ఫిబ్రవరిలో సమన్లు జారీచేసింది. సోమవారం నాడున కోర్టుకు హాజరుకాకుంటే వారెంట్ జారీచేస్తామని కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కాగా, వారెంట్ ఇస్తామని పరోక్షంగా బెదిరించడంతో తాను మెజిస్ట్రేట్ కోర్టులో విశ్వాసం కోల్పోయానని, కోర్టు పక్షపాతంతో వ్యవహరిస్తోందని కంగనా ...
Read More »రాఘవేంద్రుని దర్శించుకున్న అంజలి
ప్రముఖ ఆలయ క్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని సినీనటి అంజలి సోమవారం దర్శించుకున్నారు. మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో అంజలికి స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బఅందావనాన్ని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు సుభుదేంధ్రతీర్థులు అంజలికి చీర రవికతో పసుపు కుంకుమలతో జ్ఞాపికను ఇచ్చి ఆశీస్సులు అందజేశారు.
Read More »శ్రీవారిని దర్శించుకున్న సమంత
సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్న సమంతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్ మూవీలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు విఘ్నేశ్ శివన్ తెరకెక్కితున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి, నయన తారలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనితో పాటు సామ్ ఓ వెబ్ సిరీస్లో నటించేందుకు సంతకం చేసినట్టు వినికిడి.
Read More »మాస్ట్రో మూవీ రివ్యూ
హీరో నితిన్ మూవీలంటేనే రొటీన్కి భిన్నంగా ఉంటాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా.. నితిన్ విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆయన నటించిన మూవీ మాస్ట్రో. ఈసినిమా సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్ అంధాదున్ రీమేక్్గా తెరకెక్కింది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన పాత్రలో నితిన్ నటించారు. బాలీవుడ్లో హిట్ కొట్టిన చిత్రం.. తెలుగులో దర్శకుడు మేర్లపాక గాంధీ ఎలా తెరకెక్కించారు? ప్రేక్షకులను అలరించిందో లేదో తెలుసుకుందామా? కథ అరుణ్ (నితిన్) ఓ అంధుడు. తన బాల్యంలో ...
Read More »కొత్త సినిమాకి సమంత గ్రీన్ సిగ్నల్
ఇటీవలే సమంత పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ను పూర్తి చేసింది. మరోవైపు తమిళంలో విగేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఆర్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్లో ఓ సినిమా ప్రాజెక్ట్ కోసం సంతకం చేసింది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇతర వివరాలు చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.
Read More »మహేశ్ ఫ్యామిలీ ఇంట వినాయక నిమజ్జన వేడుకలు
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు ఫ్యామిలీ ప్రతి ఏటా వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకుంటుంది. ఇంట్లో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించి నిష్టగా పూజలు చేస్తారు. అయితే ఈ సారి పర్యావరణ సహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు ఘట్టమనేని ఫ్యామిలీ. ఘనంగా పూజలు నిర్వహించడమే కాదు.. నిమజ్జనం కూడా అలాగే చేశారు.మట్టి గణేషుడిని ఇంట్లోని తొట్టిలో నిమజ్జనం చేయగా, ఆ కార్యక్రమంలో మహేశ్, నమ్రత, సితార, గౌతమ్ పాల్గొన్నారు.
Read More »