news

హీరో అజిత్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

హీరో అజిత్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు గుర్తితెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపింది. చెన్నై తిరువాన్మియూరులో ఉన్న ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేశారు. దీంతో, ఈ కాల్ కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు.

Read More »

సామాజిక సేవ‌లో ష‌కీలా

కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో సినీ నటులు తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా నటి షకీలా పేదవారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటూ.. ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారికి ఆహారాన్ని అందిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు షకీలా. ఆహార ప్యాకెట్లు అందిస్తున్న ఫొటోలు ఆమె సోషల్‌ మీడియా ద్వారా పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా… ఆమె ...

Read More »

సూపర్ స్టార్ కి విషెస్ చెప్పిన ‘ప్రిన్స్’

తెలుగు చిత్ర సీమలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుని మూడు వందలకి పై చిలుకు చిత్రాలలో నటించిన కృష్ణ. తన సినీ కెరీర్ లో ఎన్నో సాహసాలని చేసిన సూపర్ స్టార్ కృష్ణ నేటితో (సోమవారం) 78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్‌ బాబు ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న’ ...

Read More »

‘బింబిసారుడు’గా కళ్యాణ్‌రామ్‌

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా, నిర్మాతగా ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రంతో ముందుకువస్తున్నారు. ‘బింబిసార’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. సీనియర్‌ ఎన్‌టిఆర్‌ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. క్రూరుడైన బింబిసారుడు ఫోజులో ఠీవీగా కూర్చున్న కళ్యాణ్‌రామ్‌ లుక్‌ చాలా విభిన్నంగా ఉంది. ఈ తరహా పాత్రలో కళ్యాణ్‌రామ్‌ తొలిసారి నటిస్తున్నారు. ఆ పాత్ర లుక్‌, బ్యాక్‌డ్రాప్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

Read More »

నాగార్జున సినిమాలో యాంకర్‌ రష్మి

నాగార్జున, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాను తీయబోతున్నారని తెలిసిందే. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల షుటింగ్‌ మొదలైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర నిర్మాణం త్వరలో సెట్స్‌ మీదకు రానున్నది. తాజా సమాచారం ప్రకారం ఇందులో యాంకర్‌ రష్మీ గౌతమ్‌ కీలకపాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. నాగార్జున సినిమాల్లో యాంకర్స్‌ నటించడం కొత్తకాదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో అనసూయ నటించడం తెలిసిందే.

Read More »

ఆక్సిజన్‌ బ్యాంకుల్ని ప్రారంభించిన చిరంజీవి

కరోనా క్రైసిస్‌ కాలంలో మెగాస్టార్‌ చిరంజీవి సేవాకార్యక్రమాల్ని విస్తరించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆయన ఆక్సిజన్‌ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్‌ బ్యాంకుల్ని తన అభిమాన సంఘాల అధ్యక్షులే ఆయా జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. అత్యవసరంలో ఉన్న కరోనా రోగుల్ని తక్షణం ఆదుకునేందుకు ఆస్పత్రులతో ఆక్సిజన్‌ సరఫరా దారులతో సంబంధాల్ని కొనసాగిస్తూ ఆదుకునే ప్రయత్నమిది. దీనికోసం హైదరాబాద్‌ బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి తొలి విడత ఆక్సిజన్‌ సిలిండర్లు.. కాన్‌ సన్‌ ట్రేటర్లను మెగాస్టార్‌ పంపించారని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

Read More »

మహేష్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

ఈ నెల 31న సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన కుమారుడు మహేష్‌ బాబు నటించిన సర్కారు వారి పాట ఫస్ట్‌లుక్‌ పోస్టు వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ కోవిడ్‌ పరిస్థితులు దృష్ట్యా ఎటువంటి పోస్టర్‌ కానీ, ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదని మహేష్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్టిలో ఉంచుకుని, తదుపరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చిత్ర బృందం భావించింది. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌ అయినా ...

Read More »

‘ఆచార్య’ చరణ్‌ పాత్ర

కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాపై ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న చరణ్‌ పాత్ర కూడా సినిమాలో ఎంతో కీలకమైందని, ఆ పాత్ర సెకండాఫ్‌లో ఎక్కువ భాగం ఉంటుందని, అందరూ అనుకుంటున్నట్లు చిరంజీవి, చరణ్‌ తండ్రీకొడుకుల పాత్రల్లో నటించడం లేదని దర్శకుడు శివ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని దేవాలయాలు, అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్‌ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్‌ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం చిరంజీవి ...

Read More »

ప్రభాస్‌తో తలపడనున్న బాలీవుడ్‌ హీరో

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం కనిపించబోతున్నట్లు సమాచారం. అతిథి పాత్రే అయినా విలన్స్‌ను లీడ్‌ చేసే ప్రధాన క్యారెక్టర్‌లో నటిస్తున్నాడని తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. 2021లోపే సినిమా పూర్తి చేయాలని లాక్‌డౌన్‌ ముగిసిన వెంటన్‌ షఉటింగ్‌ మొదలుపెట్టాలనుకుంటోంది చిత్రబృందం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్‌ నటిస్తోంది.

Read More »

కర్నూలులో సోనూసూద్‌ మొట్టమొదటి ఆక్సిజన్‌ ప్లాంట్‌

కరోనా బాధితులకు సోనూసూద్‌ చేస్తున్న ఎన్నో సహాయక చర్యల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణాలు ఒకటి. ఇప్పటికే యుఎస్‌, ఫ్రాన్స్‌ నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లను తెప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. వీటిని వివిధ రాష్ట్రాల్లో అవసరమైన ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. అయితే మొదటి రెండు ప్లాంట్లను మన రాష్ట్రంలోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.

Read More »