News

నేటి నుంచి నామినేషన్లు

APలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలు, ఒక MLA స్థానంలో ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ఉ.11-మ. 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం సెలవు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.

Read More »

ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు.. చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు: విజయసాయిరెడ్డి

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో పచ్చపార్టీ ఆ టికెట్‌ను వేరొకరికి ఇచ్చిందని ఆరోపించారు. దీంతో ...

Read More »

రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు..

వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితలంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డి ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లురి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. రేపు చిత్తూరు, శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, ...

Read More »

సీఎం జగన్‌ పై రాయి కేసులో ట్విస్ట్‌..ఏ2గా టీడీపీ నేత ?

సీఎం జగన్‌ పై రాయి కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సతీష్, దుర్గారావు ఇద్దరిని నేడు అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గారావు పై కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీలో సెంట్రల్ నియోజక వర్గంలో యాక్టివ్ గా దుర్గారావు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్టు విచారణలో గుర్తించారు పోలీసులు. ...

Read More »

నంద్యాలలో జనసేనకు బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

ఎన్నికల వేళ రాష్ట్రంలోని జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. నంద్యాలకు చెందిన కీలక నేత, జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్ ఈ రోజు వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అతను.. పొత్తులో భాగంగా.. టికెట్ దక్కక పోవడంతో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనను పార్టీలోకి శిల్పా మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. కాగా ఈ సమయంలో విశ్వనాథ్ వెంట భారీగా జనసేన నాయకులు కూడా వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ...

Read More »

బీఆర్ఎస్ కు షాకిచ్చిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే

లోక్ సభ ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారు. ఎంపీ టికెట్ల కేటాయింపులపై అసంతృప్తితో బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కేటాయింపులో ఎవరినీ సంప్రదించకుండానే లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారని ఆరోపించారు. లక్ష్మారెడ్డి అవకాశవాది అని, ఆయనను గెలిపించాలంటూ ప్రజల ముందుకు వెళ్లలేనని బీఆర్ఎస్ ...

Read More »

తొలి దశ పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా ఏప్రిల్ 19న (శుక్రవారం) తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదని ఈ లేఖ ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పదలచుకున్నాను. దేశంలోని కుటుంబాలు, ముఖ్యంగా వృద్ధులకు గత 5-6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలు గుర్తుండే ఉంటాయి. అయితే గత 10 పదేళ్ల ఎన్డీయే పాలనలో సమాజంలోని అన్ని వర్గాల జీవన నాణ్యత మెరుగైంది. సమస్యలు చాలా ...

Read More »

నేడు 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర..షెడ్యూల్ ఇదే

మేమంతా సిద్ధం – 17వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్‌ ఇచ్చిన సీఎం జగన్‌… ఇవాళ మళ్లీ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు సీఎం జగన్‌. అనంతరం తణుకు,రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి ...

Read More »

ఏపీలో ఫ్యాన్‌ దే హవా..

రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి.భవిష్యత్‌లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయభేరి మోగించింది. వచ్చే ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థాయిలో వైయ‌స్ఆర్‌సీపీ ఘన ...

Read More »

పదో తరగతి ఫలితాల ఆ తేదీనే..

ఆంద్రప్రదేశ్‌ లో పదో తరగతి పరీక్షలు ఇప్పటికే ముగిసాయి. దీంతో విద్యార్థులంతా ఫలితాలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అన్నీ అనుకూలిస్తే.. ఈనెల 25నే ఫలితాలు ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో రిజల్ట్స్ ప్రకటించేందుకు ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారి అనుమతి వచ్చిన వెంటనే ఈ నెలాఖరున ఫలితాలు ...

Read More »