తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టాలని కేసీఆర్కు సవాల్ చేశారు. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల పేర్లను 48 గంటల లోపల బయటపెడితే తాను బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ తుక్కుగూడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. మాజీ సీఎం ...
Read More »News
‘మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్’ పేరిట వెబ్సైట్ తీసుకువచ్చిన ఈసీ
లోక్సభ ఎన్నికల్లో అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) కొత్త వెబ్సైట్ను తీసుకువచ్చింది. మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో రూపొందించిన ఈ వెబ్సైట్ను మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ప్రారంభించారు. అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టి, ఎన్నికల సమయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకు ఈ కొత్త వెబ్సైట్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఈసీ వెల్లడించింది. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను, వెలుగులోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ ...
Read More »చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఏడో రోజు మేమంతా సిద్ధం యాత్ర..
మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈనాటి యాత్ర ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లాలోని అమ్మగారిపల్లె నుంచి ప్రారంభమయింది. ఈరోజు గోడ్లవారిపల్లె, గుండ్లపల్లిలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డు (మొధిగారిపల్లె) వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి శ్రీకాళహస్తి నియోజకర్గం రేణిగుంట సమీపంలోని గురువరాజుపల్లెలో జగన్ బస చేస్తారు. ఈనాటి యాత్ర నేపథ్యంలో… చిత్తూరు జిల్లా సిద్ధమా? ...
Read More »114 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్
లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులను ప్రకటించారు. పులివెందుల టికెట్ ను పెండింగ్ లో ఉంచారు. వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలిజా (చింతలపూడి), ఆర్థర్ (నందికొట్కూరు)కు కాంగ్రెస్ పార్టీ టికెట్లను కేటాయించింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కేటాయించింది. ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు ఉన్న సంగతి తెలిసిందే.
Read More »కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు : సీఎం రేవంత్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ పరిస్థితి చూస్తే.. జాలేస్తోంది. ఆయన అధికారం పోయిన బాధలో ఉన్నారు. పదేళ్ల తరువాత కేసీఆర్ కి రైతులు గుర్తుకొచ్చారు. మా వల్లనే కరువు వచ్చిందని అంటున్నారు. వర్షాలు కురవకపోవడంతో కరువు వచ్చింది. మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. మా వల్ల కరువు ఎలా వస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ అధికారం కోల్పోయిన దు:ఖంలో ఉన్నాడు. రైతుల మీద కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు. మేడిగడ్డ ...
Read More »ఎన్నికల ముందు జనసేనకు భారీ షాక్ ఇచ్చిన ఈసీ
ఏపీ ఎన్నికలు మే 13న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ని ఓడించి అధికారంలోకి వచ్చేందుకు.. టీడీపీ, బీజేపీలతో జనసేన పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సమయంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఈ రోజు ఎన్నికల సంఘం విడుదల చేసింది. ...
Read More »వైసీపీ గుర్తు ఎవరికీ తెలియదు..ఫ్యాన్ గుర్తును జనాల్లోకి తీసుకెళ్లాలి-ధర్మాన
వైసీపీ గుర్తు ఎవరికీ తెలియదు..ఫ్యాన్ గుర్తును జనాల్లోకి తీసుకెళ్లాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాధరావు. వైసీపీ గుర్తు ఏంటో ఇప్పటికి చాలా మందికి తెలియదు.. వైసీపీ గుర్తు ఏంటి అంటే సైకిల్, హస్తం అంటున్నారు.. ఫ్యాన్ గుర్తును జనాల్లోకి బాగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాద రావు. ఇవాళ శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాధరావు మాట్లాడుతూ…ప్రజలు జగన్ కే ఓటు వేస్తామంటున్నారని… అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామని ప్రకటించారు. గెలవక ముందే పిటీషన్లు పెట్టి వాలంటీర్ వ్యస్దను తీయించారు….రేపు ...
Read More »KCR, బండి సంజయ్లపై పొన్నం ప్రభాకర్ ఫైర్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ సీఎం కేసీఆర్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ..ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోని బండి సంజయ్కి, నాలుగు నెలల పాటు ఉలుకు పలుకు లేకుండా ఇప్పుడు పొలాల బాట పట్టిన కేసిఆర్ ఈరోజు రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ డ్రామాలకు తెరలేపారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసిఆర్, బండి సంజయ్ ఇద్దరూ కూడా ఇక్కడ దీక్ష ...
Read More »తెలంగాణలో మంచి నీటి సమస్యలు రాకుండా రేవంత్ కీలక నిర్ణయం..!
తెలంగాణలో మంచి నీటి సమస్యలు రాకుండా రేవంత్ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా చేసేందుకు ప్రతీ మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ప్రతీ రోజు మంచినీటి సరఫరాను పర్యవేక్షించడానికి ప్రతీ మండలానికి జిల్లా స్థాయి అధికారిని, ప్రతీ వార్డు, గ్రామానికి మండల స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం జిల్లాలో మంచినీటి సరఫరాను పర్యవేక్షిస్తారని ...
Read More »ఏపీలో పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాల రెడీ
పెన్షన్ పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల వల్లే సకాలంలో పెన్షన్లు అందించలేకపోయామని వైసీపీ ఆరోపించింది. తాజాగా పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తాజాగా జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. పెన్షన్ పంపిణీకి అనుసరించాల్సిన విధానాలపై వారితో చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ ...
Read More »