News

సీఎం జగన్ కు 151 సీట్లు దాటుతాయి – కొడాలి నాని

సీఎం జగన్ కు 151 సీట్లు దాటుతాయని ప్రకటించారు కొడాలి నాని. కృష్ణాజిల్లా, గుడివాడలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ వేశారు. ఇక నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 20 వేల కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ వస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని…. గద్దెనెక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు….మరో సారి గుడివాడలో విజయకేతనం ఎగురవేస్తానని ప్రకటించారు. మళ్ళీ జగనే సిఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు….సంక్షేమ పథకాల ద్వారా ...

Read More »

రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల రద్దుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పై దుష్ర్పచారం చేసి ఎలాగైనా గెలవాలని బీజేపీ చూస్తోందని అన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనపై గురువారం గాంధీభవన్ లో చార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…మోదీ సర్కార్ దేశంలోని కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయి పనిచేస్తుందన్నారు. గత ప్రధానులందరూ కలిసి రూ.54 లక్షల కోట్ల అప్పులు చేస్తే ప్రధాని ...

Read More »

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గురువారం పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈక్రమంలో సీఎం జగన్ పులివెందులలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా కమలాపురం లో టీడీపీకి షాక్ తగిలింది. ఇవాళ పులివెందులలో సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, కమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డ వీర శివారెడ్డి తెలుగుదేశం ...

Read More »

పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్

మేమంతా సిద్ధం బస్సుయాత్రను బుధవారంతో ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా గురువారం పులివెందులలో పర్యటించారు. అనంతరం అక్కడ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తొలుత పులివెందులలోని సీఎస్ ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం అక్కడ్నుంచి నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జగన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను పులివెందుల ఆర్. ఓ కు అందజేశారు. అంతకుముందు పులివెందులలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. తన ...

Read More »

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే: సీఎం జగన్

సీఎం జగన్ ఇవాళ టెక్కలి నియోజకవర్గం అక్కవరంలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సాయంత్రం వేళ అక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు అని అభివర్ణించారు. ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు గెలవాల్సిందే అని సమర శంఖం పూరించారు. డబుల్ సెంచరీ సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు. రేపటి ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి… ...

Read More »

టిప్పర్ డ్రైవ్ చేస్తూ వెళ్లి నామినేషన్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అనంతపురంలో టిప్పర్ డ్రైవ్ చేస్తూ వెళ్లి నామినేషన్ వేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. టిప్పర్ డ్రైవ్ చేస్తూ వెళ్లి నామినేషన్ వేశారు శింగనమల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సమక్షంలో వీరాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో శింగనమల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు నామినేషన్‌ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు పార్టీ శ్రేణులు.

Read More »

మరోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన పోతిన మహేశ్

ఇటీవలే జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన బెజవాడ నేత పోతిన వెంకట మహేశ్ మరోసారి పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ అన్ని విధాలుగా దిగజారిపోయారని విమర్శించారు. వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు… పార్టీలో దిగజారిపోయారు… పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టి పూర్తిగా దిగజారిపోయారు అంటూ పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు. “పవన్ కల్యాణ్ ఈ మధ్య మూడు పెళ్లాల మాటెత్తితే గింజుకుంటున్నాడు. మరి, వాలంటీర్లను పట్టుకుని ‘మానవ అక్రమ రవాణాదారులు’ అంటే కోపం రాదా ...

Read More »

అగ్రవర్ణాలన్నీ జగన్ కే మద్దతు ఇస్తున్నాయి: జోగి రమేశ్

ఎన్నారైలు రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా సేవ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని ఏపీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. కండకావరంతో టీడీపీకి సపోర్ట్ చేసే ఒక ఎన్నారై రాష్ట్ర ఓటర్లను వెధవలు అన్నాడని మండిపడ్డారు. ఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలని… మంచి చేస్తున్న జగన్ వైపే ఎన్నారైలు ఉండాలని చెప్పారు. ఎన్నారైలు చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని అన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి జగన్ సీఎంగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని… ...

Read More »

పరువు తీయడానికే పద్మారావును కేసీఆర్ సికింద్రాబాద్ నుంచి నిలబెట్టారు: రేవంత్ రెడ్డి

పద్మారావు పరువు తీయడానికే అతడిని కేసీఆర్ సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పద్మారావు నామినేషన్ దాఖలుకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. దీనిని బట్టే ఆయనకు వాళ్లు మద్దతివ్వడం లేదని అర్థమవుతోందన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ టిక్కెట్‌ను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. బుధవారం సీఎం సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

Read More »

ఆ నియోజకవర్గంలో విజయం మనదే:సీఎం జగన్

మన్యం జిల్లా సాలూరులో విజయం వైసీపీదే అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పాలూరు అభ్యర్థి పీడిక రాజన్న దొర, సాలూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు వి. శ్రీనివాస్ రెడ్డితో ఆయన మాట్లాడుతూ, సాలూరులో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, అమలు జరిపిన పథకాలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ...

Read More »