చేనేత వేడుకల్లో మంత్రి నిర్మల సీతారామన్‌

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా పొందూరులో ఘనంగా నిర్వహించబోతోన్న చేనేత వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గోనబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిర్మలా సీతారమన్ నిన్న సాయంత్రమే విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఏపీ మంత్రులు, బీజేపీ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె విమానాశ్రయం నుంచి విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ కు వెళ్లారు.