రాజధాని అమరావతిలో రైతు కూలీలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రతి నెలా వారికి అందజేస్తున్న పింఛన్ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
Read More »Tag Archives: amaravathi
ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే : మంత్రి అంబటి
ఏపీ రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వాక్యాలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లది అనైతిక పొత్తు అని రాంబాబు విమర్శించారు. ప్రత్యర్థుల్లో గందరగోళ పరిస్థితి తలెత్తిందని…. జనసేన పొత్తు…. బీజేపీతోనా? టీడీపీతోనా? అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. జగన్ మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపి స్థానాన్ని బీసీకి కేటాయించారని లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ విడిచి ...
Read More »అమరావతిలో హై టెన్షన్
అమరావతి రాజధాని రైతుల ఉద్యమం నేటితో సంవత్సరం అవుతున్న నేపథ్యంలో అమరావతి జెఎసి ఆధ్వర్యంలో రాయపూడిలో జనభేరి సభ నిర్వహిస్తున్నారు. అనేక ఆంక్షలు, నిర్బంధాలతో రైతులు ఉద్యమాన్ని సంవత్సరం పూర్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మూడు రాజధానులకు అనుకూలంగా మందడంలో కూడా దీక్షలు చేస్తున్నారు. గతంలో అమరావతి శంకుస్థాపన ప్రాంతమైన ఉద్దండరాయనిపాలెం, అమరావతి రైతులకు, మూడు రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న వారికి ఘర్షణ ...
Read More »చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకున్న పోలీసులు
ఎపి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న నిరసనలు నేటికి ఏడాది కావడంతో అమరావతి జెఎసి ఆధ్వర్యంలో రాయపూడిలో జనభేరి సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాయపూడి సభకు వెళ్తుండగా ఆయన కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్దండరాయుని పాలెం వెళ్లేందుకు కాన్వాయ్కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో టిడిపి నాయకులు, రైతులు ఆందోళనకు దిగడంతో చివరకు రెండు వాహనాలకు అనుమతి ఇచ్చారు. కాన్వాయ్లో ...
Read More »అమరావతి రైతులకు వార్షిక కౌలు, పెన్షన్ విడుదల
అమరావతి రైతులకు వార్షిక కౌలు, రెండు నెలల పెన్షన్ను ప్రభుత్వం విడుదల చేసింది. వార్షిక కౌలు చెల్లింపునకు రూ.158 కోట్లు, రెండు నెలల పెన్షన్ చెల్లింపునకు రూ.9.73 కోట్లు ఆయా రైతులు, రైతు కూలీల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బత్స సత్యనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని రైతు కూలీల పెన్షన్ రూ.5 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో అది సాధ్యపడలేదని తెలిపారు. అందువల్లే ఈసారి రూ.2,500 ...
Read More »నేడు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్
మందడంలో పోలీసుల లాఠీచార్జ్కు నిరసనగా అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజధాని గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్చంధంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా వ్యాపార కార్యకలాపాలు తెరుచుకోని పరిస్థితి నెలకొంది. మరోవైపు అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు 67వ రోజుకు చేరుకున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కిష్టాయిపాలెం, రాయవుడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది.
Read More »