Tag Archives: pawankalyan

పవన్ ను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: గ్రంధి శ్రీనివాస్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మానసిక స్థితి సరిగా లేదని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పవన్ కు నిలకడ లేదని చెప్పారు. తక్షణమే ఆయనను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. సినీ గ్లామర్ తో కార్లను మార్చినట్టు… భార్యలను పవన్ మారుస్తున్నారని విమర్శించారు. హిందూ వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించేలా పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలను ఇచ్చారని విమర్శించిన పవన్… ఇప్పుడు బీజేపీతో కలిసిపోయారని విమర్శించారు. కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించిన ...

Read More »

ఎలక్టోరల్‌ బాండ్లలో పవన్‌కు ఎంత ముట్టింది?: పోతిన మహేష్‌

ఎలక్టోరల్‌ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టిందో చెప్పాలంటూ వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీని పైకి తీసుకురావడమే పవన్‌ అజెండానా? అంటూ దుయ్యబట్టారు. పోతిన మహేష్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు దగ్గర పవన్‌ ప్యాకేజీ తీసుకున్నారని అందరికి తెలుసు. జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని?. బినామీ పేర్లతో ఉన్న పవన్‌ ఆస్తుల వివరాలు నేనే బయటపెడతా’’ అని పోతిన హెచ్చరించారు. కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి వసూలు చేసిన చందాలెంత?. అందులో రైతులకు ...

Read More »

సోనియానే ఎదిరించారు.. పవన్ ఎంత?: వెల్లంపల్లి శ్రీనివాస్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఓ వైపు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని విమర్శిస్తున్న చంద్రబాబు… ఇప్పుడు ఎన్నికలు రావడంతో ప్రతి ఇంటికి రెండు పథకాలు ఇస్తానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేనప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ నగర అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారని… ఆయనకు విజయవాడలో తిరిగే అర్హత లేదని అన్నారు. కక్ష సాధింపులను పాల్పడేది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ...

Read More »

పవన్ ది పిరికితనం, చేతకానితనం : ముద్రగడ విమర్శలు

వైసీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ ను ముద్రగడ మరోసారి టార్గెట్ చేశారు. పార్టీ కార్యకర్తలను పవన్ కనీసం దగ్గరకు కూడా రానివ్వరని ఆయన అన్నారు. పవన్ చుట్టూ ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారని… రోజుకు మూడు షిఫ్టుల్లో బౌన్సర్లు పని చేస్తారని చెప్పారు. అలాంటి పవన్ వైసీపీ నేతలను బ్లేడ్ బ్యాచ్ అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని అన్నారు. పిరికితనం, చేతకానితనంతోనే పవన్ ...

Read More »

పవన్ కల్యాణ్ కంటే చిరంజీవి ఆ విషయంలో చాలా బెటర్: ముద్రగడ

సార్వత్రిక ఎన్నికల సమరానికి అన్ని పార్టీల నేతలు సై అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు పరస్పర ఆరోపణలతో మీడియా ముందుకొస్తున్నారు. అయితే, ఇటీవలే అధికార వైసీపీలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి జనసేన అధినేతపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన కర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్ విషయాలపై హామీ ఇస్తే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ ఆ ...

Read More »

పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌…ఇండిపెండెంట్‌ గా పోటీ చేయనున్న పోతిన మహేష్ ?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇండిపెండెంట్‌ గా పోటీ చేయనున్నారట పోతిన మహేష్. బెజవాడ పశ్చిమలో రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ తన కార్యకర్తలతో జనసేన పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్ సమావేశం నిర్వహించారు. పొత్తులో పశ్చిమ టికెట్ జనసేనకు కాకుండా బీజేపీకి కేటాయించారు. దీంతో చివరి వరకు టికెట్ కోసం ఆందోళనలు చేసింది జన సేన పార్టీ. అయినప్పటికీ టికెట్ దక్కక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు పోతిన మహేష్. ఈ తరుణంలోనే… ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని జనసేన ...

Read More »

సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు?: పవన్ పై ముద్రగడ ఫైర్

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ… జనసేనాని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు? అని ఎత్తిపొడిచారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొద్దికాలంలోనే జెండా ఎత్తేశారని, పవన్ కల్యాణ్ కూడా అందుకు మినహాయింపు కాదని అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారని అభిప్రాయపడ్డారు. మా ఇంటికొస్తే ఏం తెస్తారు… మీ ఇంటికి వస్తే ఏమిస్తారు?… అన్న చందంగా సినిమా వాళ్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుందని వ్యంగ్యం ...

Read More »

పవన్ తప్పుకుంటే సీటు నాదే..పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు?

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన పిఠాపురంలో పవన్ పోటీ రోజుకో మలుపు తిరుగుతోంది. కాకినాడ ఎంపీగా పిఠాపురం జనసేన ఇన్చార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను పవన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అదే సీటు ఆశిస్తున్న పిఠాపురం టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే వర్మ మరో సంచలనానికి తెర లేపారు. తాను ఎంతో కాలంగా పిఠాపురం నియోజకవర్గంతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నానని , పొత్తు విషయంలో పవన్ కి పిఠాపురం సీటు కేటాయించి తన సీటును త్యాగం చేయాలని చంద్రబాబు కోరారన్నారు. చంద్రబాబు ఆదేశం ప్రకారం ...

Read More »

ఈ ఐదేళ్లలో తాజా లడ్డూలుగా మారిపోయాయా అంటూ పేర్ని నాని వ్యంగ్యం

మూడు పార్టీల ప్రజాగళం సభపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. విభజన హామీల నేపథ్యంలో, కేంద్రం ఏమిచ్చింది… పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది అంటూ గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2014లో తిరుపతి బాలాజీ సాక్షిగా మా కలయిక జరిగింది అని పవన్ చెప్పారు… మరి 2019లో ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు 2024లో తాజా లడ్డూలుగా మారిపోయాయా… అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. “నాడు పవన్ కాకినాడలో పాచిపోయిన లడ్డూల వ్యాఖ్యలు చేశారు. ...

Read More »

నేడు ఏపీకి మోదీ.. పల్నాడులో భారీ బహిరంగ సభ

దేశంలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ విజయవాడ కార్యాలయం ప్రకటించింది. జిల్లాలోని చిలకలూరిపేటలో సభ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. దాదాపు పదేళ్ల తరువాత కూటమి భాగస్వాములు అందరూ ఒకే వేదికపైకి రానుండటంతో ఈ సభకు ప్రాధాన్యం పెరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఇది తొలి ...

Read More »