స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలిసే చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లాలో బాబు మెజారిటీ సీట్లు గెలవలేకపోయారు. సతీష్రెడ్డి , డొక్కా మాణిక్యవరప్రసాద్, రెహమాన్ టీడీపీకి ఎందుకు రాజీనామా చేశారో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సతీష్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి.
Read More »Tag Archives: TDP
చంద్రబాబు పై మండిపడ్డ మంత్రి బొత్స సత్య నారాయణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త సంస్కరణలు తేవడం గొప్ప విషయమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు, మద్యం పంచకుండా కఠిన చట్టాన్ని అమలుపరచడం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టుబడితే మూడేళ్ల జైలుతో పాటు, అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందన్నారు. బీసీలకు మేలు చేసేందుకే సీఎం జగన్ 58.95 శాతం రిజర్వేషన్లు తెచ్చారని వెల్లడించారు. అయితే బీసీ రిజర్వేషన్లను టీడీపీ నేతలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. ...
Read More »కేబినెట్ భేటీలో మంత్రులతో జగన్ ఆసక్తికర చర్చ!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత సీఎం జగన్.. మంత్రులకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారట. ఈ నెలలోనే ఎన్నికలు జరగనుండటంతో.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారట. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారట. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చుక్క మద్యం, ఒక్క రూపాయి ...
Read More »వైసీపీ నేత హత్యకు కుట్ర.. చంద్రబాబు నియోజకవర్గంలో కలకలం
చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన వైఎస్సార్సీపీ నేత హత్యకు కుట్ర జరిగింది. పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్కు రూ.10లక్షలు సుపారీ ఇచ్చి విద్యాసాగర్ను హత్య చేయించేందుకు ప్లాన్ చేశారు. అడ్వాన్స్గా కొంత డబ్బును చెల్లించారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్న విద్యాసాగర్.. కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు కుట్రకు సంబంధించి ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుపారీ ఇచ్చింది ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు. విద్యాసాగర్ ఎన్నికలకు ముందు టీడీపీను వీడి వైఎస్సార్సీపీలో ...
Read More »నేడు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
ప్రకాశం జిల్లాలో మాజీ సిఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి చంద్రబాబు ప్రకాశం జిల్లాకు బయలుదేరనున్నారు. 11 గంటలకు బప్పూడి కి చేరుకొని అక్కడున్న ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తారు. 11.30 గంటలకు బస్సు యాత్రను ప్రారంభిస్తారు. 12.30 గంటలకు మార్టూరు బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. 12.50 గంటలకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. 2.20 గంటలకు మేదరమెట్ల బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. 7 గంటలకు ఒంగోలు ...
Read More »దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే భవాని
సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సీరియస్గా తీసుకున్నారు. ఆమె రాజమండ్రి దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలోఅసభ్యకర కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భవానికి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్స్టేషన్కు తరలివచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం దిశ పోలీస్ స్టేషన్ దగ్గర టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణగా దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. ...
Read More »ఉమా Vs దేవినేని.. బెజవాడ మార్క్ రాజకీయం!
రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల పింఛన్లు తొలగించారని టీడీపీ ఆరోపిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడుతోంది. బొండా ఉమా కూడా విజయవాడ ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలతో పాటూ పింఛన్లు తొలగించారని చెబుతున్న కొందరు బాధితుల్ని తీసుకొచ్చారు. పింఛన్పై ఆధారపడి బతుకున్నవారిని ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇటు బొండా ఉమాకు కౌంటర్గా వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ కూడా భారీ ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని.. ర్యాలీ తర్వాత ఓ సభ ...
Read More »బాలయ్య చిన్నల్లుడు భరత్కు షాక్
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీభరత్కు బ్యాంక్ షాకిచ్చింది. రూ.124.39కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్యాబ్యాంక్ నోటీసులు పంపించింది.. నోటీసులకు శ్రీభరత్ స్పందించకపోవడంతో ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమయ్యింది. గతంలో హైదరాబాద్ అబిడ్స్ బ్రాంచ్లో గాజువాక, భీమిలిలోని భూములు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఈ ఆస్తుల జప్తుకు కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా శ్రీభరత్పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బాలయ్య చిన్నల్లుడి కుటుంబం రూ. 13 కోట్లకుపైగా బకాయి పడిందని ఆంధ్రా బ్యాంక్ ...
Read More »