Tag Archives: tirupathi

శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా రెండు నెలలకు పైగా మూతపడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి తెరుచుకోనుంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఈవో రాసిన లేఖకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దర్శనానికి అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్‌ ...

Read More »

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని

శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే తిరుమలలోని శ్రీ వెకటేశ్వరస్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. రాజపక్సేకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రధాని రాజపక్సే ప్రత్యేక పూజాలు నిర్వహించారు. రాజపక్సేకు పూజారులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »