Tag Archives: tollywood news

26న ‘గీత’ విడుదల

హెబ్బా పటేల్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గీత’ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ‘గ్రాండ్‌ మూవీస్‌’ పతాకంపై ఆర్‌.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్‌ శిష్యుడు విశ్వా.ఆర్‌.రావు దర్శకత్వం వహిస్తున్నారు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ చిత్రాల ఫేమ్‌ సాయి కిరణ్‌ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. రామ్‌ కార్తిక్‌, సప్తగిరి, రాజీవ్‌ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సుభాష్‌ ఆనంద్‌ సంగీతం అందిస్తున్నారు.

Read More »

ఎంటర్‌టైనింగ్‌ మూవీగా ‘వాంటెడ్‌ పండుగాడ్‌’

కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్‌ కె ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్‌ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ పట్టుకుంటే కోటి ట్యాగ్‌ లైన్‌. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ బిగ్‌ టికెట్‌ లాంఛ్‌ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఎంటర్‌టైనింగ్‌ మూవీగా ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ ఆగస్ట్‌ ...

Read More »

‘మార్క్‌ ఆంటోనీ’ షూటింగ్‌లో నటుడు విశాల్‌కు గాయలు

‘మార్క్‌ ఆంటోనీ’ ఘూటింగ్‌లో కోలీవుడ్‌ నటుడు విశాల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ”మార్క్‌ ఆంటోనీ చిత్రీకరణలో విశాల్‌కు తీవ్రంగా గాయపడ్డారు. సినిమాలోని కీలక ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రథమ చికిత్స అనంతరం విశాల్‌ షూట్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.” అని తెలిపింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

Read More »

‘ఒకే ఒక జీవితం’ సెప్టెంబర్ 9న విడుదల

నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమల అక్కినేని, శర్వానంద్, నాజర్, రీతూ వర్మ, ప్రియదర్శి పులికొండ, వెన్నెల కిషోర్, అలీ తదితర భారీ తారాగణం వుంది. చిత్రానికి సుజిత్ సారంగ్ కెమెరాను అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ గా , సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో  తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్, అమల అక్కినేని, నాజర్, రీతూ వర్మ రెండు భాషల్లోనూ తమ పాత్రలని ...

Read More »

‘ప్రేమిస్తున్నానంటూ ఓ వ్యక్తి ఆరేళ్లుగా వేధిస్తున్నాడు ‘ : నిత్యామేనన్‌

ప్రేమిస్తున్నానంటూ సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనను ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని సినీ నటి నిత్యామేనన్‌ తెలిపారు. ఇటీవల ఓ కోలీవుడ్‌ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గన్న ఆమె తన పెళ్లి గురించి జరిగిన ప్రచారంపై తాజాగా మరోసారి స్పందించారు. ”కొన్నిరోజులుగా నా పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం సంతోష్‌ వర్కీ అనే యూట్యూబర్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆరోజు నుంచి ఈ వార్తలు వెలువడుతున్నాయి. నిజం చెప్పాలంటే, అతడు దాదాపు ఆరేళ్ల నుంచి ...

Read More »

‘సీతారామం’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది.ఈ చిత్రంలో రష్మిక, తరుణ్‌ భాస్కర్‌, సుమంత్‌, భూమిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్‌, కథ, స్క్రీన్‌ ప్లే, మ్యూజిక్‌ సహా హీరో, హీరోయిన్ల నటన కూడా బాగా కుదిరాయి. దాంతో ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆరు వారాల ...

Read More »

తమిళ సినిమా పరిశ్రమలో ఐటీ దాడుల కలకలం

తమిళ సినిమా పరిశ్రమలో ఐటీ దాడుల కలకలం రేగింది. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పన్నుఎగవేతలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో… మంగళవారం ఆదాయ పన్ను శాఖ తనిఖీలు నిర్వహించింది. ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయం నుంచి సోదాలు ప్రారంభమయ్యాయి.ఇదివరకు 2020 ఫిబ్రవరిలో చెన్నైలోని అన్బు చెగియాన్‌కు చెందిన నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. తమిళ స్టార్‌ విజయ్ నటించిన బిగిల్‌ సినిమా విడుదలైన తర్వాత ఆ తనిఖీలు జరిగాయి. అప్పుడు విజయ్, మరికొందరు నిర్మాతల ఆర్థిక కార్యకలాపాలపై ఐటీ దృష్టి సారించింది.

Read More »

‘రామారావు మాస్‌ నోటీస్‌’

రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో శరత్‌ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రామారావు మాస్‌ నోటీస్‌’ పేరుతో మరో ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ ...

Read More »

దిగొచ్చిన స్టార్‌ హీరోలు

టాలీవుడ్‌ బంద్‌ నిర్ణయంతో స్టార్‌ హీరోలు దిగొచ్చారు. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుండటంతో ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో  సెట్స్‌పై ఉన్న సినిమా షూటింగులన్నీ నిలిచిపోనున్నాయి.  ఈ నిర్ణయంపై  ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు స్టార్‌ హీరోలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పలువురు హీరోలు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకునేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. వీరిలో ఎన్‌టిఆర్‌; రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఉన్నారు. వీళ్లంతా వచ్చే సినిమాల నుంచి తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకుంటామని దిల్‌ ...

Read More »

కోలివుడ్‌ ఎంట్రీ ఇస్తున్న చాందిని

ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైన ‘కలర్‌ ఫోటో’ హీరోయిన్‌ చాందినీ చౌదరి. పలు చిత్రాలతో పాటు వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ తెలుగు హీరోయిన్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘మై కడవులే, మన్మథ లీలై’ చిత్రాల హీరో అశోక్‌ సెల్వన్‌కు జంటగా నటించబోతున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ తమిళ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ద్వారా హీరో కమల్‌ హాసన్‌ శిష్యుడు సిఎస్‌.కార్తికేయన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నందుకు చాందినీ ...

Read More »