హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మొదట తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.
Read More »Tag Archives: trs party
టీఆర్ఎస్ పై రెచ్చిపోయిన జగ్గారెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మిషన్ కాకతీయ.. మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ఎప్పుడు నింపుతారో ఎవరికీ తెలియదన్నారు. కాంగ్రెస్ పేదలకు భూములు పంచితే.. టీఆర్ఎస్ భూములు అమ్ముతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని జగ్గారెడ్డి అన్నారు.
Read More »