Tag Archives: vijaysai reddy

చంద్రబాబు.. మీ దిమ్మ తిరుగుతుంది: VSR

ప్రజలు జగన్ను మరోసారి CMగా చూడాలని నిర్ణయించుకున్నారని YCP MP విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ‘మీ న’మ్మకస్తుడు నిమ్మగడ్డ రమేశ్తో వాలంటీర్లపై విషం చిమ్మించావు. వదిన పురందీశ్వరితో 22 మంది IPSలపై ఫిర్యాదు చేయించావు. ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా దొంగ దెబ్బ కొడుతున్నా అనుకుంటున్నావేమో. ప్రజలు కొట్టే దెబ్బకు మీ దిమ్మ తిరుగుతుంది. ఇవే మీకు ఆఖరి ఎలక్షన్లు’ అని ట్వీట్ చేశారు.

Read More »

ప్రాణం పోయేవరకు జగన్ వెంటే ఉంటా – విజయసాయిరెడ్డి

నెల్లూరులోనే నిత్యం ఉంటా..ప్రాణం పోయేవరకు జగన్ వెంటే ఉంటానని నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. నేను గెలిస్తే ఢిల్లీకి ఎక్స్ పోర్ట్ అవుతానంట… నెల్లూరును పట్టించుకోనని వేమిరెడ్డి గారు ఛలోక్తులు విసురుతున్నారని ఆగ్రహించారు నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి. ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ బిజినెస్‌లు చేస్తున్నందు వలన అలవాటు ప్రకారం ఆయన ఆ పదం వాడి ఉంటారని తెలిపారు. నాకు ఏ వ్యాపారాలు లేవు. పార్లమెంటు సమావేశాలప్పుడు తప్ప మిగిలిన రోజులు నెల్లూరులోనే ఉంటా. ప్రాణం ...

Read More »

చంద్రబాబు ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు: విజయసాయిరెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈసారి ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే ప్రథమం. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తే. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో, తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల స్థితిగతులపై దృష్టి సారించారు. ఇటీవల కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. “చంద్రబాబు మానిప్యులేషన్స్ ...

Read More »

సీఎం కావడం కోసం సాష్టాంగ నమస్కారం: VSR

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని నాశనం చేయదని.. చంద్రబాబు సొంత చర్యలే టీడీపీకి చేటు చేస్తాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘నాలుగేళ్ల నుంచి ఆయన చెప్పిన మాటలన్నీ మరిచారు. పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కారు. చివరిసారి తాను ముఖ్యమంత్రి కావడం కోసం సాష్టాంగ నమస్కారం చేయడానికి సిద్ధపడటం ఆశ్చర్యంగా ఉంది. ఎంత సిగ్గుచేటు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Read More »

రాజ్యసభలో కాంగ్రెస్ పై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజ్యసభలో కాంగ్రెస్ పై యంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ కు అలవాటేనన్నారు. దేశంలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అదృశ్యమైందన్నారు విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ కంటితుడుపు హామీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 2029లో కూడా నేను ఎంపీగా ఉంటా… 2029లో కాంగ్రెస్ కు ...

Read More »

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర ప్రారంభం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం మెయిన్ గేట్ వరకు పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. 

Read More »