Tag Archives: ycp

పవన్ కళ్యాణ్ కు షాక్.. ఇవాళ పిఠాపురంలో అడుగుపెట్టనున్న సీఎం జగన్ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తన బస్సు యాత్రను కొనసాగించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ బస్సు యాత్రలో భాగంగా ఇవ్వాల ఉదయం ఎస్టి రాజపురం రాత్రి బస చేసిన నుంచి బయలుదేరుతారు జగన్. ఆ తర్వాత రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ ...

Read More »

సీఎం జగన్‌పై దాడి కేసు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే ఈ దాడి అంశం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. సీఎం జగన్‌పై దాడి చేయించింది టీడీపీ నేతలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై పథకం ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదన్నారు. ...

Read More »

ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు.. చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు: విజయసాయిరెడ్డి

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో పచ్చపార్టీ ఆ టికెట్‌ను వేరొకరికి ఇచ్చిందని ఆరోపించారు. దీంతో ...

Read More »

నంద్యాలలో జనసేనకు బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

ఎన్నికల వేళ రాష్ట్రంలోని జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. నంద్యాలకు చెందిన కీలక నేత, జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్ ఈ రోజు వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అతను.. పొత్తులో భాగంగా.. టికెట్ దక్కక పోవడంతో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనను పార్టీలోకి శిల్పా మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. కాగా ఈ సమయంలో విశ్వనాథ్ వెంట భారీగా జనసేన నాయకులు కూడా వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ...

Read More »

నేడు 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర..షెడ్యూల్ ఇదే

మేమంతా సిద్ధం – 17వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్‌ ఇచ్చిన సీఎం జగన్‌… ఇవాళ మళ్లీ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు సీఎం జగన్‌. అనంతరం తణుకు,రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి ...

Read More »

జగన్ కోసం మానవ బాంబునవుతా: MLA అభ్యర్థి

టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను చంపాలని చూస్తే మానవ బాంబుగా మారేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తనలాంటి వారు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్పై దాడిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగనన్ను ఏం చేయాలనుకుంటున్నారని దువ్వాడ ప్రశ్నించారు.

Read More »

CM జగన్ నేటి బస్సు యాత్ర షెడ్యూల్

జగన్ చేపట్టిన బస్సు యాత్ర 16వ రోజైన నేటి షెడ్యూల్ను YCP విడుదల చేసింది. నిన్న బస చేసిన నారాయణపురం నుంచి బయల్దేరనున్న CM.. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం బయల్దేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ వద్ద జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి శిబిరానికి చేరుకుంటారు.

Read More »

మీ బిడ్డ అదరడు.. బెదరడు: సీఎం జగన్

పేదల భవిష్యత్తు, పథకాల కొనసాగింపు కోసం వైసీపీని గెలిపించాలని సీఎం జగన్ కోరారు. గుడివాడ సభలో మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వానికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు కుట్రదారులు చుట్టుముట్టారు. కుటిల పద్మవ్యూహంలో నాపై వీరంతా దాడి చేస్తున్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు.. బెదరడు. కృష్ణుడనే ప్రజలు నాకు అండగా ఉన్నారు. మన విజయం తథ్యం’ అని చెప్పుకొచ్చారు.

Read More »

చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్..?

గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభలో కొడాలి నాని మాట్లాడుతూ… సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైందన్నారు. అంతేకాకుండా,వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు కొడాలి నాని. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతోమందిని సీఎం జగన్ ఆదుకున్నారన్నారు. చంద్రబాబుది మాయా కూటమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక కుట్రలు చేశాడని మండిపడ్డారు. దేవుడు, ప్రజల ఆశీస్సులే సీఎం జగన్‌ను కాపాడాయన్నారు.

Read More »

సీఎం జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న‌.. నిందితుల‌ను ప‌ట్టిస్తే రూ. 2 ల‌క్ష‌ల రివార్డు!

విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్మోహ‌న్ రెడ్డిపై కొందరు ఆగంతుకులు రాయితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ ఘ‌ట‌న‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నిందితుల గురించి తమకు స‌మాచారం అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. అలాగే త‌మ‌కు స‌మాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు.

Read More »