Tag Archives: ysrcp

జగన్‌ను హతమార్చాలని చంద్రబాబు కుట్ర-మంత్రి అంబటి

విజయవాడలో కుట్ర ప్రకారంగానే సీఎం జగన్‌పై దాడి జరిగిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సోమవారం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించారని అన్నారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడులకు దిగుతున్నారని విమర్శించారు. జగన్‌ను హతమార్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు అని అన్నారు. ముగ్గురూ కలిసి ఓడించడం కష్టమని భావించి హతమార్చాలనే కుట్ర చేశారని ...

Read More »

దాడి తర్వాత తొలిసారి బయటకు జగన్

మరికాసేపట్లో CM జగన్ 15వ రోజు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. యాత్ర ప్రారంభానికి ముందు పలువురు నేతలు ఆయన్ను పరామర్శించారు. గాయం తీవ్రత, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలతో నవ్వుతూ, చాలా సరదాగా జగన్ మాట్లాడారు. అటు CMపై దాడి జరిగిన కంటి ప్రాంతంలో ఇంకా వాపు కనిపిస్తుండగా.. దానిపై వైట్ బ్యాండెడ్ ఉంది. ఇక గాయం తీవ్రత నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని YCP శ్రేణులు కోరుకుంటున్నాయి.

Read More »

లోకేశ్ ఓటుకు రూ. 6 వేలు పంచుతాడు: జగన్

టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఓటుకు రూ. 6 వేలు పంచుతారని ఆయన అన్నారు. లోకేశ్ డబ్బులు పంచినట్టు మన వైసీపీ అభ్యర్థి లావణ్య పంచలేదని… ఎందుకంటే లోకేశ్ దగ్గర ఉన్నట్టు లావణ్య దగ్గర డబ్బులు లేవని చెప్పారు. లోకేశ్ డబ్బులు ఇస్తే తీసుకోవాలని… అయితే ఓటు వేసే ముందు మాత్రం ఆలోచించాలని అన్నారు. జూన్, జులై నెలల్లో చేయూత, నేతన్న హస్తం, అమ్మఒడిని ఎవరు ఇస్తున్నారో వారికే ఓటు ...

Read More »

ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

పార్లమెంట్ ఎన్నికల వేళ ఏపీలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే, గుంటూరు టికెట్ ఆశించిన ఆయనకు పార్టీ అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర గుంటూరు జిల్లా పల్నాడులో కొనసాగుతోంది. ఇవాళ్టి సిద్ధం ...

Read More »

14వ రోజుకు చేరిన జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. ఉమ్మడి గుంటూరు (D) నంబూరు బైపాస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, CK కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కానున్నారు.

Read More »

సోనియానే ఎదిరించారు.. పవన్ ఎంత?: వెల్లంపల్లి శ్రీనివాస్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఓ వైపు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని విమర్శిస్తున్న చంద్రబాబు… ఇప్పుడు ఎన్నికలు రావడంతో ప్రతి ఇంటికి రెండు పథకాలు ఇస్తానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేనప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ నగర అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారని… ఆయనకు విజయవాడలో తిరిగే అర్హత లేదని అన్నారు. కక్ష సాధింపులను పాల్పడేది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ...

Read More »

షర్మిల చేసిన త‌ప్పు అదే: విజ‌య‌సాయి రెడ్డి

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌పై ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ష‌ర్మిల‌ తెలంగాణ‌లో పార్టీ పెట్టిన‌ప్పుడు తాము ఏమీ అన‌లేద‌ని, కానీ ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో చేర‌డం ఆమె చేసిన రాజ‌కీయ త‌ప్పిదం అని అన్నారు. ఆమె వెనుక ఎవ‌రు ఉన్నారో కూడా అంద‌రికీ తెలుస‌ని విజ‌య‌సాయి అన్నారు. అలాగే సీఎం జ‌గ‌న్‌తో ష‌ర్మిల రాజ‌కీయంగా విభేదించిన మాట వాస్త‌వ‌మేన‌న్నారు. ఇక ఎన్‌డీఏలో వైసీపీ చేరిక‌పై కూడా ...

Read More »

వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీగా వ‌ల‌స‌లు..

ఎన్నిక‌ల వేళ తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల నుంచి భారీగా వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయి. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ పాల‌న‌కు ఆక‌ర్శితులైన టీడీపీ, జన‌సేన కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ మేమంతా సిద్దం బస్సుయాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు చేరారు.

Read More »

జనసేనకు గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరిన పోతిన మహేశ్

రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ ...

Read More »

షర్మిల వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన అవినాశ్ రెడ్డి

వివేకా హంతకుడు ఎంపీ అవినాశ్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మసి పూస్తారు, బురద చల్లుతారు… వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు… వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా… దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు అని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మాట్లాడుకోవాలంటే అంత మాట్లాడుకోండి… నాకెలాంటి అభ్యంతరం లేదు… ...

Read More »